వైసీపీ ప్రభుత్వానికి రైతులంటే చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి. నీటిని ఎలా వాడుకోవాలో ఈ ప్రభుత్వానికి తెలియడం లేదన్న ఆయన.. పోలవరం నుంచి బాణక చర్లకు నీరు తెస్తామని జగన్ కాకమ్మ కథలు చెబుతున్నారని విమర్శించారు. సాగునీటి కోసం రాయలసీమలో ఉన్న ఏ ఒక్క వైసీపీ ఎమ్మల్యే నోరు మెదపడం లేదన్నారు. గ్రామాల్లో ఉన్న వైసీపీ గుంపుల ముఠాను చూసి ప్రజలు భయపడుతున్నారని ఆరోపించారు బైరెడ్డి.