మండలిలో పరిపాలన వికేంద్రీకరణ, CRDA చట్టం రద్దు బిల్లులపై వ్యవహారం ముదురుతోంది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు దస్త్రాన్ని మండలి కార్యదర్శి తిప్పి పంపడంపై ఛైర్మన్ షరీఫ్ సీరియస్ అయ్యారు. వెంటనే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని కార్యదర్శిని ఆదేశించారు. ఇంకా జాప్యం కొనసాగితే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని షరీఫ్ హెచ్చరించారు.