యోగా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్రావు అన్నారు. యోగా చేయడం వల్ల వంద ఏళ్లకు పైగా బతికిన వ్యక్తులను మనం చూస్తునే ఉన్నామని.. జీవన విధానం మారిన పరిస్థితుల్లో ప్రాణాయామం మరింత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. సంగారెడ్డిలో 80 లక్షల రూపాయలతో యోగా భవనం, రెండు కోట్లతో బిర్లా సైన్స్ మ్యూజియం నిర్మిస్తున్నామని హరీష్ వెల్లడించారు.