ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటున్నారు తిరుపతి ప్రజలు. రాజధాని రైతులు చేస్తోన్న ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని వారంతా డిమాండ్ చేశారు.