బెజవాడలో ఘరానా మోసం వెలుగు చూసింది. వైఎస్ భారతీ పీఏ నంటూ జగదీష్ సత్యశ్రీరాం అనే కేటుగాడు.. నిరుద్యోగులకు టోకరా పెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడు. పంచాయితీ సెక్రటేరియట్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ అందిన కాడి కి దండుకుంటున్నాడు. ఇతన్ని నమ్మి డబ్బులిచ్చిన అఖిల్ అనే యువకుడు.. తాను మోసపోయానని గ్రహించి భవానీపురం పీఎస్లో ఫిర్యాదు చేశాడు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.