రైతుల తరపున ఎంతవరకైనా పోరాడుతా: పవన్

Update: 2020-02-15 16:02 GMT

ప్రతి ఐదేళ్లకొకసారి రాజధాని మార్చడం సరికాదన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఆనాడు అమరావతిని ఏపీ రాజధానిగా వైసీపీ కూడా ఒప్పుకుందన్నారు. ఇష్టం లేకున్నా ఆంధ్రరాష్ట్ర భవిష్యత్‌ కోసం రైతులు భూములిచ్చారని గుర్తు చేశారు. కృష్ణాయ పాలెం రైతులకు సంఘీభావం తెలిపిన పవన్‌.. రైతుల తరపున ఎంతవరకైనా పోరాడేందుకు జనసేన సిద్ధంగా ఉందన్నారు.

అంతకుముందు.. యర్రబాలెం రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన పవన్.. వారికి సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం రాజధానిని మారుస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. రైతుల కన్నీరు రాష్ట్ర భవిష్యత్‌కు మంచిది కాదన్న జనసేన అధినేత.. సీఎం మారినప్పుడల్లా రాజధాని మార్చితే పాలన అస్తవ్యస్థమవుతుందన్నారు.

Similar News