మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించిన మెప్మా ఉద్యోగులు

Update: 2020-02-15 18:44 GMT

విశాఖలో.. 14 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు కోసం మెప్మా ఆర్పీలు చేస్తోన్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మంత్రి అవంతి ఇంటిని ముట్టడించారు మెప్మా ఉద్యోగులు. దీంతో వారిని అరెస్ట్‌ చేసారు పోలీసులు. తమ పట్ల పోలీసులు.. దారుణంగా ప్రవర్తించారని, మహిళలని చూడకుండా మగపోలీసులు తమపై విచక్షణారహితం వ్యవహరించారన్నారు. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటున్న ఆర్పీలు మండిపడుతున్నారు.

Similar News