మందడంలో రైతులతో జరిగిన సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని తాను భావించడం లేదని అన్నారు. వైసీపీ, బీజేపీ మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవని అన్నారు. అమరావతి కోసమే తాము బీజేపీతో కలిసి నడుస్తున్నట్లు చెప్పిన పవన్.. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంలో తప్పులేదని.. అయితే, వైసీపీ చేరితే బీజేపీతో కలిసి నడబోమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.