అమరావతి ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ కుట్ర : మాజీ మంత్రి దేవినేని
అమరావతి ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు.. వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు టీడీపీ నేత దేవినేని ఉమ. పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ ప్రయత్నాలన్నీచేస్తున్నారని అని ఆరోపించారు. మంత్రి బొత్స తీరుపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు దేవినేని. ఆసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు. జగన్ ఢిల్లీకి వెళ్తూ బొత్సతో లీకులు ఇప్పించారని విమర్శించారు. అసలు ఆయనకు మంత్రి పదవి అవసరమా అని ప్రశ్నించారు.