విశాఖలో ఉద్రిక్తత.. ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ పనులను అడ్డుకున్న రైతులు

Update: 2020-02-17 15:28 GMT

విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో ప్రభుత్వ భూసేకరణ పనులు ఉద్రిక్తతకు దారి తీశాయి. పెంటవాని చెరువు దగ్గర ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ పనులను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే అక్కడ పోలీసులు మోహరించారు. రైతులకు మద్దతుగా టీడీపీ నేతలు బండారు సత్యనారాయణ మూర్తి, గండి బాబ్జీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బలవంతపు భూసేకరణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Similar News