ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పురుపాలక సదస్సు ప్రారంభమైంది. ఇందులో సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతిపై విధివిధానాలు ఖరారు చేయనున్నారు. సదస్సులో ఎమ్మెల్యేలు, మేయర్లు, ఛైర్ పర్సన్లు.. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, కమిషనర్లు పాల్గొన్నారు. ఈనెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నారు. పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులకు... ప్రభుత్వ లక్ష్యాలు, ప్రణాళికలు, ఆలోచనలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.