ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు వ్యవహారం ఢిల్లీ చేరనుంది. టీడీపీ ఎమ్మెల్సీలు మంగళవారం హస్తిన వెళ్లనున్నారు. ఉప రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారైంది. తమ రెండు రోజుల పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ కారణాలతో మండలి రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే విషయాన్ని కేంద్ర పెద్దలకు టీడీపీ ఎమ్మెల్సీల బృందం వివరించనుంది.