ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి భయం....ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోమురంభీం, మంచిర్యాల జిల్లాల సరిహద్దు గ్రామాల్లోని జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.. వ్యవసాయ పనులకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. పెన్గంగ-ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాలు పులుల ఆవాసానికి అనువుగా ఉండటంతో ఇటీవల సంచారం బాగా పెరిగింది.