జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో రంగులు వేసుకుంటూ పాలన సాగిస్తోందన్నారు మాజీ మంత్రి చినరాజప్ప. 9 నెలల జగన్ పాలనలో ఏ గ్రామంలోనూ అభివృద్ధి జరగలేదన్నారు. రాక్షసులతో పోరాడుతున్నానని సీఎం చెప్పడం విడ్డూరంగా వుందన్న ఆయన.. జగనే పెద్ద రాక్షసుడని.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకే.. టీడీపీ ప్రజాచైతన్య యాత్రలు చేస్తోందని చినరాజప్ప అన్నారు.