పోలవరం పనులను పరిశీలించిన సీఎం జగన్

Update: 2020-02-28 17:45 GMT

ప్రాజెక్టుబాటలో భాగంగా పోలవరం పనుల్ని పరిశీలించారు సీఎం జగన్‌. స్పిల్‌వే, కాఫర్ డ్యామ్ పనులను పరిశీలించి.. ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ప్రాజెక్టు పరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం జగన్ వెంట పలువురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తర్వాత ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం, పునరావాసంపైనా దృష్టిసారించారు సీఎం జగన్.

Similar News