కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడిగా గుర్తించిన ఆటోడ్రైవర్ అన్నం వెంకటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన జరిగి 24 గంటలు కూడ గడవకముందే అన్ని ఆధారాలతో స్థానిక గాందీనగర్కు చెందిన నిందితుడు వెంకటేశ్వరరావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో ప్రజాసంఘాలు, సామాజిక వేత్తలు, రాజకీయనాయకులు మహిళసంఘాలు పోలీసులను ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. ఇటువంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడు వెంకటేశ్వరరావుని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.