చంద్రబాబును విశాఖలో స్థానిక ప్రజలే అడ్డుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్లు ఆరోపిస్తున్నట్టు పులివెందులకు చెందిన ఒక్కరు కూడా విశాఖ ఎయిర్ పోర్టుకు రాలేదని.. అలా ఒక్కరు వచ్చినట్టు నిరూపించినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అన్నారు మంత్రి అవంతి.. లేదంటే చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాకి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.