చంద్రబాబుపై ఎయిర్పోర్టులో దాడికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేశారనే కోపంతోనే ప్రజలు స్వచ్ఛంధంగా అడ్డుకున్నారన్నారు. ప్రతిసారి విశాఖ ప్రజల్ని కించపరుస్తూ చంద్రబాబు మాట్లాడుతున్నారని.. అందుకే ఎయిర్పోర్టులో అడ్డుకొని ఉంటారని బొత్స అభిప్రాయపడ్డారు.