దేశంలో అన్ని పార్టీలకు టిఆర్ఎస్ ఆదర్శంగా నిలుస్తోంది అన్నారు ఎమ్మెల్యే బాల్కా సుమన్.. ఏ రాష్ట్రంలోని లేని విధంగా సహకార ఎన్నికల్లో 9 స్థానాలకు తొమ్మిదీ టీఆరెస్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. గడిచిన ఏడాది కాలంలో ఎన్నిక ఏదైనా తీర్పు ఏకపక్షంగా టీఆరెస్కు ప్రజలు పట్టం కడుతున్నారన్నారు. గతంలో ఏ ఎన్నిక జరిగినా ఉద్రిక్తత చోటుచేసుకునేదని.. కానీ కేసీఆర్ నాయకత్వంలో ప్రశాంత వాతావరణంలో అన్ని ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మాత్రమే చేస్తారనంటూ సుమన్ మండిపడ్డారు.