డోన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

Update: 2020-03-04 12:57 GMT

కర్నూలు జిల్లా డోన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెళ్లయిన కొన్ని రోజులకే భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో కావ్య అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కావ్య భర్త, అతని తండ్రి విచారణకు వచ్చారు. ఆగ్రహానికి గురైన బాధితురాలి బంధువులు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. అప్రమత్తమై పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు.

 

Similar News