రాజధాని అంశం రాష్ట్రపరిధిలోనిదే అని ఇందులో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఎంతమాత్రం లేదని మరోసారి తేల్చిచెప్పారు బీజేపీ ఎంపీ జీవీఎల్. అయితే అమరావతే ఏపీ కేపిటల్గా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని.. అందుకే రాజకీయంగా తీర్మానం కూడా చేశామన్నారు. అంతమాత్రాన కేంద్రం చట్టాలను మార్చి రాజధాని విషయంలో జోక్యం చేసుకోవాలని కోరడం సరికాదని అన్నారు.