స్థానిక ఎన్నికల్లో మైనార్టీ ఓట్లకోసం వైసీపీ కొత్త నాటకాలు ఆడుతోంది: తులసిరెడ్డి

Update: 2020-03-06 18:26 GMT

నవరత్నాల పేరుతో.. నవమాసాలలో నవమోసాలు చేసిన ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనార్టీ ఓట్ల కోసం కొత్త నాటకాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ హోటల్‌లో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలతో అన్ని పార్టీలకు బుద్ధి చెబుతామని అన్నారు తులసిరెడ్డి.

Similar News