వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు అనంతపురం జిల్లా కదిరి టీడీపీ ఇంఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్. హామీలను నెరవేర్చడంతో వైసీపీ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్పై వైసీపీ తన వైఖరి తెలపాలన్నారు. కదిరిలో నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కందికుంట పాల్గొన్నారు.