సేవ్ సింహాచలం పేరుతో ఉద్యమానికి పిలుపునిచ్చింది ఏపీ సాధుపరిషత్. విశాఖ ప్రెస్క్లబ్లో పోస్టర్లను ఆవిష్కరించారు సాధుపరిషత్ ఛైర్మన్ శ్రీనివాసానంద సరస్వతి. హిందూధర్మంపై వరుసగా జరుగుతోన్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. హిందూ ఆచార వ్యవహారాలపై కనీస పరిజ్ఞానం లేనివారిని ట్రస్ట్బోర్డు ఛైర్మన్గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.. విదేశాల్లో పెరిగిన సంచిత మన సంప్రదాయాలని ఎలా కాపాడుతారని నిలదీశారు శ్రీనివాసానంద సరస్వతి.