వచ్చే బడ్జెట్లో స్వల్పంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతామన్నారు సీఎం కేసీఆర్. గడిచిన ఆరేళ్లలో ఒకేసారి మాత్రమే ఛార్జీలు పెంచామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని.. ఎక్కడా ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం లేదని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన కరెంట్ను అందిస్తున్నామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.