ఇళ్లపట్టాల పంపిణీ పథకం ఎన్నికల నియమావళికి విరుద్ధం : ఏపీ ఎన్నికల కమిషనర్‌

Update: 2020-03-11 07:47 GMT

ఉగాది నాటికి ఇళ్లపట్టాల పంపిణీ పథకం ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఏపీ ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రభుత్వాలని నిలుపుదల చేయాలని గతంలోనే చెప్పామని.. అయినా ప్రభుత్వం ముందుకు వెళ్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ పార్టీవారైనా నామినేషన్లు వేయడాన్ని అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.. అలాగే ప్రభుత్వ భవనాలకు ఉన్న రంగులు తొలగించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. వాటిని తొలగిస్తామన్నారు.

Similar News