విజయవాడలో కార్పోరేషన్ ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బెజవాడ కార్పోరేషన్ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసారు ఎంపీ కేశినేని నాని. విజయవాడ మేయర్ అభ్యర్ధిగా తన కూతురు శ్వేత అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. దీనిపై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ కేశినేని నాని అన్నారు.