తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగించే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. స్పీకర్తో సమావేశమైన సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేసే అంశంపై చర్చిస్తున్నారు. కాసేపట్లో అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు. అటు తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటోంది.