ఎన్నికల కమిషనర్ ఆదేశించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ హోం మంత్రి చినరాజప్ప డిమాండ్ చేశారు. ఎన్నికల పరిధిలో ఉండగా.. ఎస్ఈసీకి సీఎస్ ఎలా లేఖ రాస్తారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో 60 డీఎస్పీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారంటూ విమర్శించారు. అలాగే రాష్ట్రంలో కరోనా కేసులను ప్రభుత్వం తొక్కిపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.