సీఎం జగన్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు బీజేపీ నాయకురాలు సాదినేని యామిని. ప్రజల ఆరోగ్యం కన్నా ఎన్నికలే ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. కరోనా వైరస్ పట్ల కేంద్రం, రాష్ట్రాలు అప్రమత్తమైనా.. జగన్కు మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఎన్నికల కమిషనర్కి కూడా కులం అంటగట్టేలా.. జగన్ దిగజారుడు రాజకీయలు చేస్తున్నారని యామిని మండిపడ్డారు.