నల్గొండ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం చెలరేగింది. జిల్లా కేంద్రంలోని జైల్ ఖానా సమీపంలోని ప్రార్థనా మందిరంలో దాదాపు 15 మంది వియత్నాం దేశ బృందం ఉన్నట్టు ఆలస్యంగా బయటపడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. పోలీసులు స్పాట్కు చేరుకుని.. ప్రత్యేక ఆంబులెన్సులో అర్థరాత్రి హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. కరోనా లక్షణాలు లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా తరలించామన్నారు డీఎస్పీ.