కరోనా ఎఫెక్ట్.. నెల్లూరులో భారీగా పెరిగిన రైల్వే ఫ్లాట్ ఫాం టికెట్ ధరలు
కరోనా వైరస్ మరింతగా వ్యాప్తిచెందకుండా దేశవ్యాప్తంగా అనేక రైళ్లను రైల్వే శాఖ రద్దు చేస్తోంది. దీంతో ఇప్పటికే దాదాపు 40 శాతం మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. నెల్లూరు మీదుగా నడిచే పలు స్పెషల్ రైళ్లు రద్దు చేశారు. ప్రయాణికుల వెంట రైల్వే స్టేషన్కు వచ్చే బంధుమిత్రుల రాకను తగ్గించేందుకు.. ప్లాట్ ఫాం టికెట్ ధరను భారీగా పెంచారు. రోజుకు లక్షల్లో నష్టం వస్తున్నా.. కరోనాను నివారించడమే తమ లక్ష్యమని నెల్లూరు జిల్లా రైల్వే అధికారులు తెలిపారు.