లాక్ డౌన్ తో రెచ్చిపోతున్న బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు

Update: 2020-03-23 16:23 GMT

మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు.. అసలే కరోనాతో జనం వణికిపోతుంటే.. బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. ఈనెల 31 వరకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో కొమురం భీం జిల్లాలో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. నిత్యావసరాల ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచేసే జనాన్ని లూటీచేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ధరలు అందుబాటులోనే వుంటాయని ప్రభుత్వం ప్రకటించినా.. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో జనాలు లబోదిబో అంటున్నారు.

Similar News