ఏపీలో లాక్‌డౌన్ : వైసీపీ నేతలు, జీవీఎంసీ అధికారులే బేఖాతరు

Update: 2020-03-23 18:51 GMT

కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఏపీలో లాక్‌డౌన్ ప్రకటించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఆయన ఆదేశాలను వైసీపీ నేతలు, జీవీఎంసీ అధికారులే బేఖాతరు చేశారు. విశాఖలో అత్యుత్సాహం ప్రదర్శించారు..మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో గుంపులు గుంపులుగా పర్యటించారు.. కనీసం ఏ ఒక్కరూ మాస్కులు కూడా ధరించలేదు. ఇల్లు దాటి బయటకు రావద్దని ప్రజలకు చెబుతూ అధికారులు, అధికార పార్టీ నేతలే ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం..

రాజీవ్ గృహకల్పలో పర్యటించిన వారిలో జోనల్ కమిషనర్ రాము, 5వ వార్డు వైసీపీ అభ్యర్థి పోతిన సంధ్య, ఆమె భర్త మాజీ కార్పొరేటర్ హనుమంతరావు ఉన్నారు... కరోనా వైరస్ కట్టడికి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులే ఇలా జనాన్ని పోగేసుకొని కాలనీల్లో పర్యటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News