కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి లాక్డౌన్ను కొనసాగిస్తున్నారు. అయితే రాజమహేంద్రవరం అర్బన్ పోలీసులు పరోక్షంగా ఒక వ్యక్తి మృతికి కారణమయ్యారు. గోదావరి జిల్లాల వారధిగా ఉన్న రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జిపై పలు ఆంక్షలు విధించి రాకపోకలు నిలిపివేశారు. అయితే బ్రిడ్జి మధ్యలో రోప్ కట్టారు. అయితే ఇది గుర్తించకుండా రోడ్పైకి వచ్చిన ఓ ల్యాబ్ టెక్నిషియన్ కిందపడి తల పగిలి చనిపోయాడు.