ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా ఏపీలో వేగంగా వ్యాప్తిస్తుంది. దీంతో పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కర్నూల్కు చెందిన పోలీసు వినూత్నపంతా ఎంచుకున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరించేందుకు ఓ గుర్రానికి కరోనా వైరస్ను పెయింటింగ్గా వేయించారు. ప్రజల్లో అవగాహన తీసుకు రావడం కోసం గుర్రానికి కరోనా వైరస్ పెయింట్ వేసి విధుల్లో తిరుగుతున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొంత మంది పోలీస్ చేసిన పనిని సమర్థిస్తుంటే.. మరికొందరేమో.. నోరులేని జీవాన్ని ఇలా హింసించడం సరైనది కాదని కామెంట్ చేస్తున్నారు.
Andhra Pradesh: Sub Inspector Maruti Sankar, Peapally Mandal, Kurnool district rides a horse painted with images of #COVID19 virus, to create awareness among the public about the pandemic pic.twitter.com/xIFsktWahG
— ANI (@ANI) March 31, 2020