ఆంధ్రప్రదేశ్ మాజీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ తప్పు అంటూ అప్పట్లోనే హడావుడి చేసి చేసింది. దాన్ని ప్రచురించిన వారిమీద కూడా చర్యలు తీసుకుంటాము అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆ లేఖ వాస్తవం అని చెప్పి అప్పట్లోనే కేంద్ర హోమ్ శాఖ ధృవీకరించింది. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఆ లేఖ వాస్తవం కాదు, ఆయన సంతకం వేరుగా ఉంది.. ఫోర్జరీ లేఖ అని..
దీనిని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తదితరులు రూపొందించారు.. వారిమీద చర్యలు తీసుకోవాలని, విచారణ చెయ్యాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.. అయితే కేంద్ర హోమ్ శాఖకు ఎన్నికల కమిషనర్ హోదాలో ఆ లేఖ తానే రాశానని.. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దానిని దృవీకరించారు అని.. మధ్యలో మూడో వ్యకికి ఏమి సంబంధం అంటూ రమేష్ కుమార్ మండిపడ్డారు.