ఉద్యోగులను తొలగించవద్దు : కేటీఆర్‌

Update: 2020-04-18 19:26 GMT

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించవద్దని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చోరువ తీసుకోవాలని తెలిపారు. మీ ఉద్యోగుల పట్ల సానుభూతి చూపాలన్నారు. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ కంపెనీల అధినేతలకు కేటీఆర్‌ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ తర్వాత సిబ్బందిని తొలగించవద్దని లేఖలో మంత్రి కోరారు. ఉద్యోగాలు తీసివేయకుండా ఖర్చులు తగ్గించుకోవాలని కంపెనీలకు సూచించారు. లాక్‌డౌన్‌ తరువాత త్వరలోనే పరిశ్రమలు పుంజుకుంటాయని పేర్కొన్నారు.

Similar News