విశాఖ విషాదం: బాధితులను పరామర్శించిన మంత్రి అవంతి

Update: 2020-05-07 16:22 GMT

విశాఖ ప్రమాదఘటన దురదృష్టకరమని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ప్రమాదానికి గురై కేజీహెచ్‌ ఆస్పత్రి పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై.. డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేజీహెచ్‌తో పాటు నగరంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రిల్లో కూడా బాధితులను మెరుగైన చికిత్స జరుగుతుందన్నారు మంత్రి. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి.. పరిస్థితిని సమీక్షిస్తుందన్నారు.

Similar News