భారీగా ధరలు పెంచి మద్య నియంత్రణ చేస్తామంటున్న సీఎం జగన్ తీరు.. అతని అజ్ఞానికి పరాకాష్ట అని టీడీపీ నాయకురాలు అనిత విమర్శించారు. మందు తాగేవాళ్లు ధరలు తగ్గినా, పెంచినా తాగుతారన్నారు. 45 రోజులుగా లాక్డౌన్లో పిల్లపాపలతో ఇంట్లో ఉన్న వాళ్లు మద్యం షాపులు తెరవడంతో రోడ్లపైకి వచ్చారన్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు అనిత.