వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 13 రైళ్ల ద్వారా వలస కార్మికులను వారి రాష్ట్రలకు తరలించారు. కార్మికుల తరలింపు కోసం తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు 4 కోట్ల రూపాయలు చెల్లించిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.