గుంటూరులో ఎమ్మెల్యే ముస్తఫాకు నిరసన సెగ ఎదురైంది. గత 40 రోజుల నుంచి ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. నిన్ననే క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన ఆయన.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బైక్పై పర్యటించారు. సోమవారం బరిస్తాయిలో నిత్యావసరాలు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు, గ్రామస్థులు ఆయన్ను అడ్డుకున్నారు.. ప్రజలకు కరోనా విస్తరిస్తారా అంటూ నిలదీశారు.