వందే భారత్ మిషన్లో భాగంగా గల్ఫ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తెలుగువారు స్వదేశానికి వస్తున్నారు. ప్రస్తుతం అబుదాబీ నుంచి ప్రత్యేక విమానంలో కొందరు శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. రాత్రికల్లా వారు ఇక్కడికి చేరుకుంటారు. లాక్డౌన్ వల్ల గల్ఫ్లో చిక్కుకున్నవారు పడుతున్న ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తెస్తూనే ఉంది టీవీ5. దీంట్లో భాగంగా ఇప్పుడు అక్కడి వారిని బయలుదేరే ముందు కూడా పలకరించింది.