బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ హోం క్వారంటైన్కు వెళ్లారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు దగ్గర ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం హోమ్ క్వారంటైన్ ముద్ర వేశారు. తాను అత్యవసరంగా హైదరాబాద్కు రావాల్సి వచ్చిందని.. ఈ నేపథ్యంలోనే పరీక్షలు చేసి క్వారంటైన్ స్టాంప్ వేశారని పుల్లెల గోపీచంద్ చెప్పారు. ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి ప్రయాణికుడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.