గుంటూరులో స్మగ్లర్ల గుట్టురట్టు

Update: 2020-05-13 16:44 GMT

లాక్‌డౌన్‌ సమయంలో స్మగ్లర్లు రూటు మార్చారు. గుంటూరులో నిషేధిత గుట్కా, ఖైనీ రవాణాను దొంగ దారిన తరలిస్తూ పట్టుబడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా అరటికాయల లోడులో తరలిస్తున్న గుట్కా, ఖైనీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 7 లక్షలకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు నుంచి గుంటూరుకు తరలిస్తుండగా వీటిని పట్టుకున్న పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Similar News