తెలంగాణలో కొత్తగా 47 కరోనా కేసులు

Update: 2020-05-14 23:23 GMT

తెలంగాణలో కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1414కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 939 మంది కోలుకోగా.. 428 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటివరకూ 34 మంది మరణించారు. ఈ రోజు నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 మందికి, రంగారెడ్డిలో ఐదుగురికి, మరో ఇద్దరు వలస కూలీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

Similar News