గాలివాన బీభత్సం.. కూలిపోయిన టెంట్లు.. పరుగులు పెట్టిన పోలీసులు, వైద్య సిబ్బంది
తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం రామాపురం బోర్డర్ చెక్పోస్ట్లో.. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన పోలీస్, వైద్య శిబిరాలు తుడిచిపెట్టుకుపోయాయి. గాలివాన దుమారంతో టెంట్లు కుప్పకూలిపోగా.. పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అయితే, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.