డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు నిర్ణయంపై స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ హింస, నిర్బంధం, తప్పుడు ప్రచారం వెనక ప్రభుత్వం చేసిన కుట్రను సీబీఐ నిగ్గు తేలుస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. కొవిడ్పై పోరాడేందుకు ఎన్95 మాస్క్ అడగటమే డాక్టర్ సుధాకర్ చేసిన తప్పా అని ప్రశ్నించారు చంద్రబాబు.