ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8 వేల 415 శాంపిల్స్ పరీక్షించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2వేల 514కు చేరింది. శుక్రవారం నమోదైన కేసుల్లో చిత్తూరులో 4, నెల్లూరులో 14 కేసులకు కోయంబేడ్ లింక్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక కరోనాతో... కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందినట్టు హెల్త్ బులెటిన్లో స్పష్టంచేశారు. దీంతో.. ఏపీవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 55కి చేరింది.