బిగ్ బ్రేకింగ్.. ఏపీ ప్రభుత్వానికి మళ్లీ ఎదురుదెబ్బ.. హైకోర్టు సీరియస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులపై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. జీవో నెం.623ని న్యాయస్థానం సస్పెండ్ చేసింది. రంగుల అంశంపై హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. కేసును సుమోటోగా తీసుకుంటున్నామన్న హైకోర్టు.. సీఎస్, ఈసీ, పంచాయతీ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.